Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 మంది విద్యార్థులపై టీచర్ వీరగం.. కర్పూరంతో పాదాలను కాల్చేసింది. ఎక్కడ..?!

Advertiesment
Teacher funished students in villupuram
, శుక్రవారం, 10 జూన్ 2016 (17:22 IST)
విద్యార్థుల పట్ల ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించింది. పాఠశాలకు సరిగ్గా రావట్లేదని.. ఇంకా బాగా చదవట్లేదనే కారణంతో ఓ టీచర్ విద్యార్థుల పాదాలను కర్పూరం వెలిగించి కాల్చేసింది. ఈ ఘటన తమిళనాడులోని విళుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉలుందూరు పేట సమీపంలోని పల్లి పన్ జయత్ అనే ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు వైజయంతిమాల అనే టీచర్ పాఠాలు బోధించేది. 
 
అయితే కొందరు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా రాకపోవడంతో పాటు చదువుపై శ్రద్ధ చూపించకపోవడంతో కర్పూరాన్ని వెలిగించి.. ఆ నిప్పుతో 13 మంది చిన్నారులను గాయపరిచింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విళుపురం విద్యాధికారి మార్స్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా వైజయంతిమాలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పాఠశాల హెడ్‌మాస్టర్‌ వద్ద కూడా విచారణ చేపట్టాలని మార్స్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హృద్రోగం, అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్న రోగికి పొత్తికడుపులో కణితి తొలగింపు