Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు
, సోమవారం, 29 నవంబరు 2021 (08:18 IST)
జిల్లా కేంద్రమైన వేలూరు పట్టణంలో సోమవారం వేకువజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వరదలు కూడా ముంచెత్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజా వేలూరులో భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. 
 
భూకంప కేంద్రాన్ని వేలూరుకు 59 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అలాగే, భూగర్భంలో 25 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు సిస్మోలజీ విభాగం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై తదితర వివరాలు తెలియాల్సివుంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాష్ట్ర గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత.. ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తరలింపు