Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నాళ్లకి కాంగ్రెస్ కీలకం... ఖుషీ ఖుషీగా హస్తం ఎమ్మెల్యేలు.. ఎక్కడ?

అదేమరి. గడ్డి పోచకు కూడా ఏదో ఒక రోజు బలం వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో అలా అందరూ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనబడుతోంది. ఎందుకో తెలుసా. ఇప్పుడక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితే ఇందుకు కారణం. శశికళ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం

ఎన్నాళ్లకి కాంగ్రెస్ కీలకం... ఖుషీ ఖుషీగా హస్తం ఎమ్మెల్యేలు.. ఎక్కడ?
, మంగళవారం, 22 ఆగస్టు 2017 (19:31 IST)
అదేమరి. గడ్డి పోచకు కూడా ఏదో ఒక రోజు బలం వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో అలా అందరూ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనబడుతోంది. ఎందుకో తెలుసా. ఇప్పుడక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితే ఇందుకు కారణం. శశికళ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం పాండిచ్చేరిలో బస చేసి వున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును ఎలా కూలదోయగలమనే ప్లాన్లు వేసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కీలకం కానుంది. 
 
దీనికి కారణం ఇదే... తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 234(-1... అంటే జయలలిత స్థానం). అన్నాడీఎంకే బలం 116 సీట్లు. దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 19 మంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 89. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 8 మంది. ముస్లింలీగ్ ఒక్కరు. ఐతే ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలకు మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం వుంటుంది. ఆ అవసరమే వస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదిస్తే సరిపోతుందని కొందరు అన్నాడీఎంకే నాయకులు అంటున్నారట. దీనితో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా ఖుషీగా వున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా: పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్!