Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త భార్యతో ముద్దూముచ్చట తీర్చుకుని... ప్రియురాలితో భర్త జంప్

కొత్త భార్యతో నెల రోజుల పాటు ముద్దూముచ్చట తీర్చుకున్న కట్టుకున్న భర్త ఆ తర్వాత ప్రియురాలితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా ఆర్కే.పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన

కొత్త భార్యతో ముద్దూముచ్చట తీర్చుకుని... ప్రియురాలితో భర్త జంప్
, బుధవారం, 27 జూన్ 2018 (10:04 IST)
కొత్త భార్యతో నెల రోజుల పాటు ముద్దూముచ్చట తీర్చుకున్న కట్టుకున్న భర్త ఆ తర్వాత ప్రియురాలితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా ఆర్కే.పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకాలోని రంగాపురానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనాదేవి (21)కి నెల రోజుల క్రితం వేలూరు జిల్లా పుదూరుకు చెందిన తంగరాజుతో వివాహమైంది. ఆమెతో నెల రోజుల పాటు సంసారం చేశాడు. అయితే, అప్పటికే మరో యువతి ప్రేమలో మునిగి తేలుతున్న తంగరాజు తాజాగా ప్రియురాలితో కలిసి పరారయ్యాడు.
 
అవమాన భారం తట్టుకోలేని అర్చన పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మానసికక్షోభకు గురైన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్ల పారాణి ఆరలేదు.. నవవధువు ఆత్మహత్య.. భర్త ఏం చేశాడో తెలుసా?