Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నాటకలో తమిళులపై దాడులు.. 15న తమిళనాడు రాష్ట్ర బంద్

కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్

కర్నాటకలో తమిళులపై దాడులు.. 15న తమిళనాడు రాష్ట్ర బంద్
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:15 IST)
కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
 
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం పెను వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలో తమిళులపై దాడులు కూడా జరిగాయి. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులకు నిరసనగా బుధవారం తమిళనాడు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 
 
అదేసమయంలో చెన్నైలో కర్నాటకకు చెందిన 171 ఆఫీసులు, 68 హోటల్లు, 66 బ్యాంకుల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నాటక - తమిళనాడు సరిహద్దు దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు... కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరి జలాల వ్యవహారం: మనమంతా మనుషులం.. విధ్వంసం ఆపండి: ప్రకాష్ రాజ్