Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెరుగుపడుతున్న జయలలిత ఆరోగ్యం... మరికొన్ని నెలలు ఆస్పత్రిలోనే....

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని తెలిపాయి.

Advertiesment
మెరుగుపడుతున్న జయలలిత ఆరోగ్యం... మరికొన్ని నెలలు ఆస్పత్రిలోనే....
, శుక్రవారం, 7 అక్టోబరు 2016 (10:19 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని తెలిపాయి. 'ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం సీఎంకు చికిత్స అందిస్తోంది. వీరి చికిత్సకు జయలలిత బాగానే స్పందిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బేల్ గురువారం జయను మరోమారు పరీక్షించారు' అని అపోలో వర్గాలు పేర్కొన్నాయి.
 
గత నెల 22వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... ముఖ్యమంత్రికి ఉన్న మధుమేహం, వింటర్ బ్రాంకైటిస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వైద్యుల సూచనల మేరకు మెడికల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించినట్టు అపోలో సీఈవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. 
 
ఎయిమ్స్ నుంచి వచ్చిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ జి.ఖిల్నానీ, అనస్తీషియాలజీ, క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ అంజంత్రికా, కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ నితిశ్ నాయక్ జయలలితను పరీక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలల్లో 101 దోపిడీలు.. ఘరానా దొంగ అరెస్ట్.. ఆరు సంవత్సరాల జైలుశిక్ష