తమిళనాడు అసెంబ్లీలో రగడ... సభ వాయిదా.. స్పీకర్ మైక్ విరగ్గొట్టిన విపక్షాలు
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు సభలో అల్లర్లకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టిముట్టి రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు అస
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు సభలో అల్లర్లకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టిముట్టి రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు అసెంబ్లీ వాయిదా పడింది.
రహస్య ఓటింగ్ జరపాలని డీఎంకే నేత స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వం పట్టుబట్టారు. స్పీకర్ తిరస్కరించడంతో అసెంబ్లీలో నినాదాలతో హోరెత్తించారు. గందరగోళంతో సభను అరగంటపాటు సభను స్పీకర్ వాయిదా వేశారు.
అంతకుముందు.. రహస్య ఓటింగ్ తిరస్కరించడంపై విపక్ష నేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ వాయిదాకు పట్టుబట్టారు. సభలో గందరగోళం కారణంగా ఓటింగ్కు అంతరాయం ఏర్పడింది. ముందు ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోండంటూస్పీకర్కు పన్నీర్ సెల్వం సూచించారు. ఆ తర్వాత బలనిరూపణ చేయాలంటూ డిమాండ్ చేశారు.
కాగా, మొదటి రెండు బ్లాకుల్లో పళనిస్వామికి మెజార్టీ దక్కింది. ఒక్కో బ్లాకులో 38 మంది సభ్యులు ఉన్నారు. కాగా, మొత్తం 6 బ్లాకుల్లో సాగుతున్న ఓటింగ్. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే యత్నిస్తోంది. ఓటింగ్ ప్రక్రియలో తొందరెందుకని ప్రశ్నించింది. డీఎంకే ఎమ్మెల్యేల గందరగోళంతో అరగంటపాటు సభ వాయిదా పడినట్లు తెలిసింది. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు.