Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎనిమిది స్కూల్ విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగికదాడి

crime scene
, ఆదివారం, 31 జులై 2022 (14:19 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ ప్రిన్సిపాల్ ఎనిమిది మంది బాలుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని పూణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరత్‌లోని స్థానిక మున్సిపల్ పాఠశాలలో నిషంత్ వ్యాస్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదివే బాలుళ్ళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై స్కూలు యాజమాన్యం స్పందించింది. అలాగే, ప్రిన్సిపాల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లైంగిక దాడి తర్వాత పరాలీలో ఉన్న ప్రిన్సిపాల్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు పోలీసులపై నమ్మకం పోయింది : నటి కస్తూరి