Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరవుపై కేంద్రానికి సుప్రీంకోర్టు తలంటు... మైండ్ సెట్ మార్చుకోండని సూచన

కరవు రక్కసిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మైండ్ సెట్ మార్చుకోవాలని సూచన చేసింది. గత వేసవిలో జరిగిన తప్పులు పునరావృతం కావడానికి వీల్లేదని పేర్కొంది. పైగా కరవు పరిస్థితులను తట్

Advertiesment
కరవుపై కేంద్రానికి సుప్రీంకోర్టు తలంటు... మైండ్ సెట్ మార్చుకోండని సూచన
, గురువారం, 6 అక్టోబరు 2016 (09:49 IST)
కరవు రక్కసిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. మైండ్ సెట్ మార్చుకోవాలని సూచన చేసింది. గత వేసవిలో జరిగిన తప్పులు పునరావృతం కావడానికి వీల్లేదని పేర్కొంది. పైగా కరవు పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
గతంలో మాదిరిగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశముంది కనుక ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ స్వరాజ్ అభియాన్ అనే ఎన్జీవో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి హెచ్చరికలు చేసింది.
 
గత వేసవిలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా సహా దేశంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడిపోయిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గతంలో సరైన సమయంలో కరవు ప్రాంతాలుగా ప్రకటించలేదని, అదేతప్పు మళ్లీ చేయవద్దని చెప్పింది. 'ఇల్లు కాలుతున్నప్పుడే బావి తవ్వే ప్రయత్నం చేయకండి' అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియో పంపిన ఢిల్లీ వాసి.. ఐటీ యాక్ట్‌పై కేసు