దేశ వ్యాప్తంగా వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు తాజాగా వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిందిం. ఈ మేరకు ఆగస్టు 29వ తేదీన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గత యేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పన్ను విధింపుపై స్పష్టైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, హైవేల వంటి ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ప్రతిపఫలంగా వాహన యజమానులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
అయితే, ఒక వాహనాన్ని రోడ్లపైకి తీసుకురాకుండా పూర్తిగా వాడకంలో లేకుండా పక్కనపెట్టినపుడు దాని యజమాని ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినట్టు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితుల్లో వాహన వినియోగంలో లేని కాలానికి యజమానిపై మోటారు వాహన పన్ను భారం మోపడం సరికాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో వాడకుండా నిలిపివేసిన వాహనాలు ఉన్న యజమానులకు పెద్ద ఊరట లభించినట్టయింది.