కావేరి జలాలను విడుదల చేయాల్సిందే : కర్ణాటకకు సుప్రీం ఆదేశాలు
కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కావేరి జల వివాదంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పింది. సోమవా
కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కావేరి జల వివాదంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పింది. సోమవారం జరిగిన విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
కావేరి జలాల్లో 15 వేల క్యూసెక్కుల నీటిని 10 రోజుల పాటు విడతలవారీగా అందజేయాలని కోర్టు తెలిపింది. తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమని వాదించిన కర్ణాటక వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.. వెరసి కావేరి జలాల కోసం ఇరు రాష్ట్రాల .మధ్య జరుగుతున్న పోరులో కర్ణాటక వాదన తప్పని తేలిపోయింది.
కాగా, కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు కావేరి జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయితే, కర్ణాటక ట్రిబ్యునల్ తీర్పును తుంగలో తొక్కి నీటిని విడుదల చేయక పోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.