Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీని కొనసాగిస్తే ముప్పే.. అబార్షన్‌కు సుప్రీం అనుమతి!

ప్రెగ్నెన్సీని కొనసాగిస్తే తల్లి ప్రాణాలకే ముప్పు అంటూ ముంబైకి చెందిన ఆస్పత్రుల మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. పిండం ఎదుగుద

అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీని కొనసాగిస్తే ముప్పే.. అబార్షన్‌కు సుప్రీం అనుమతి!
, మంగళవారం, 26 జులై 2016 (10:56 IST)
ప్రెగ్నెన్సీని కొనసాగిస్తే తల్లి ప్రాణాలకే ముప్పు అంటూ ముంబైకి చెందిన ఆస్పత్రుల మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. పిండం ఎదుగుదల సరిగా లేదని, కావున అబార్షన్ చేసుకునేందుకు అనుమతివ్వాలని ముంబైకి చెందిన ఓ యువతి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
భ్రూణహత్యలను నివారించేందుకు ఈ సీలింగ్‌ విధించినట్లు తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 కింద అబార్షన్‌కు ఉన్న 20 వారాల సీలింగ్‌ వర్తించదని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ కోర్టుకు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరంతో వచ్చిన బాలికపై పాకిస్థాన్ డాక్టర్ లైంగిక దాడి.. అహ్మదాబాద్‌లో...