Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దూద్‌ దురంతో స్పెషల్స్‌' ద్వారా 5 కోట్ల లీటర్ల పాల సరఫరా

'దూద్‌ దురంతో స్పెషల్స్‌' ద్వారా 5 కోట్ల లీటర్ల పాల సరఫరా
, శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:57 IST)
కోవిడ్‌`19 లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరమైన పాలను దేశ వ్యాప్తంగా  సరఫరా చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చొరవ తీసుకొని 26 మార్చి 2020 నుంచి ‘‘దూద్‌ దురంతో స్పెషల్స్‌’’ ద్వారా ప్రత్యేకంగా పాల సరఫరాను ప్రారంభించింది.  ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వరకు ఈ ప్రత్యేక రైలు ఆ రోజు నుంచి నిర్వహించడుతుంది.

ప్రారంభంలో రోజు విడిచి రోజు నడిచే ఈ రైలు డిమాండ్‌ను బట్టి 15 జులై 2020 నుంచి రోజవారీగా నడుపబడుతుంది.  నేటి వరకూ అంటే 17 డిసెంబర్‌ 2020 నాటికి 5 కోట్ల లీటర్లకు పైగా పాలను సరఫరా చేసి ఈ ప్రత్యేక పాల ప్రధాన మైురాయికి చేరుకుంది. 
 
రేణిగుంట నుంచి న్యూఢల్లీికి పాలను సరఫరా చేసిన ఈ రైలు దేశ వ్యాప్తంగా పాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషించింది.  దీని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని దక్షిణ మధ్య రైల్వే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమ ప్రాధాన్యత ఇస్తూ రేణిగుంట మరియు హజ్రత నిజాముద్దీన్‌ (2300 కి.మీ) మధ్య 30 గంటలో చేరుకునే విధంగా ‘‘దూద్‌ దురంతో’’ ప్రత్యేక రౖుెను నడిపింది. 

నాలుగు కోట్ల లీటర్ల నుంచి 5 కోట్ల లీటర్ల సరఫరాకు చేరుకోవడానికి 37 రోజు మాత్రమే పట్టిందని చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. ఈ ప్రత్యేక పాల రైలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి కోటి లీటర్ల సరఫరాను  చేరుకోవడానికి గతంతో పోలిస్తే స్థిరంగా తక్కువ సమయం తీసుకుంది. 
 
ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకూ పాల సరఫరా (లీటర్లలో) పట్టిన సమయం

26 మార్చి - 23 జూన్‌ - 1 కోటి 90 రోజు
24 జూన్‌ - 12 ఆగస్టు - 1 కోటి (మొత్తం 2 కోట్లు) 50 రోజు (140 రోజు)
13 ఆగస్టు - 28 సెప్టెంబర్‌-  1 కోటి (మొత్తం 3 కోట్లు) 47 రోజు (187 రోజు)
29 సెప్టెంబర్‌ - 10 నవంబర్‌ - 1 కోటి (మొత్తం 4 కోట్లు) 43 రోజు (230 రోజు)
11 నవంబర్‌ - 17 డిసెంబర్‌ - 1 కోటి (మొత్తం 5 కోట్లు) 37 రోజు (267 రోజు)

దూద్‌ దురంతో ప్రత్యేక రైలు ఒక పాట ట్యాంకర్‌కు 40,000 లీటర్ల సామర్థ్యంతో సాధారణంగా 06 పాల ట్యాంకర్లతో నడిచింది. అనగా మొత్తం ఆ రౖుెలో 2.40 క్ష లీటర్ల పాల సరఫరా జరిగింది. దూద్‌ దురంతో ప్రత్యే రైళ్లు ఇప్పటి వరకూ 207 ట్రిప్పులో 1256 పా ట్యాంకర్లతో 5 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసింది.
 
దేశానికి అవసరమైన పాలను సరఫరాచేయడంలో నిరంతర కృషి చేసిన గుంతకల్‌ డివిజన్‌ మరియు జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ సిబ్బంది మరియు అధికారును దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఈ సందర్భంగా అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే 5 కోట్ల లీటర్ల పాల సరఫరా మార్కును దాటడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఇదే స్ఫూర్తిని అధికాయి భవిష్యత్తులో కూడా కొనసాగించాని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19, 20 తేదీల్లో అంతర్జాల అంతర్జాతీయ కవి సమ్మేళనం