Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుజనా చౌదరి చప్పట్లు కొట్టడం సరికాదు... మతిలేని పనులంటే ఇవే : చంద్రబాబు

రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఉపసభాపతి పీజే కురియన్ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు.. కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరిచడంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద

Advertiesment
Sujana Chaudhary
, శనివారం, 6 ఆగస్టు 2016 (09:57 IST)
రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ఉపసభాపతి పీజే కురియన్ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యులతో పాటు.. కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ సుజనా చౌదరి బల్లలు చరిచడంపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి ఓ విలేఖరి తీసుకొచ్చారు. దీనిపై బాబు స్పందిస్తూ.. 'కేంద్ర మంత్రిగా ఉండి ఆయనకు అర్థంకాకుండా చేశారో ఏమో తెలీదు గానీ.. అలా చప్పట్లు కొట్టడం సరికాదు. ఇలాంటివే మతిలేని చర్యలంటే' అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా నాటకాలాడుతోంది. ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వస్తు సేవల బిల్లుకు మద్దతు తెలపాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబరు బిల్లును ఆమెదించాల్సిందే అని మెలిక పెట్టి ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ మెంబరు బిల్లు ఆమోదం పొంది ఉండేదని చంద్రబాబు అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా మిన్నకుండి పోయిందన్నారు 
 
రాజకీయాల్లో అవకాశమున్నప్పుడే గట్టిగా అడిగి సాధించుకోవాలి. ఆ పార్టీ అలా చేయలేదు. దీన్ని బట్టే వారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రయోజనం పొందాలన్న లక్ష్యమే తప్ప ప్రజలకు మేలు చేయాలన్నది ఆ పార్టీ ఉద్దేశం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాయామం పేరుతో 8 మంది విద్యార్థినిలపై పీఈటీ మాస్టర్ అత్యాచారం!