Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నచేప... ఆ జాలరి ప్రాణం తీసింది.. ఎలాగో తెలుసా?

వలలో చిక్కిన చిన్న చేపే కదా అని నోట్లో కొరికాడు. అంతే ఈ చిన్న చేపే ఆ జాలరి మృతికి కారణమైంది.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సిద్ధ లింగ

చిన్నచేప... ఆ జాలరి ప్రాణం తీసింది.. ఎలాగో తెలుసా?
, సోమవారం, 21 మే 2018 (11:18 IST)
వలలో చిక్కిన చిన్న చేపే కదా అని నోట్లో కొరికాడు. అంతే ఈ చిన్న చేపే ఆ జాలరి మృతికి కారణమైంది.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టేందుకు ఆరుంగురికై గ్రామానికి చెందిన అన్నామలై ఆదివారం చేపలు పట్టేందుకు జాలర్లతో కలిసి వెళ్లాడు. 
 
అన్నామలై వలలో ఓ చేప చిక్కింది. ఆ చేప వల కొసభాగంలో ఇనుప ముల్లుకు చిక్కుకుంది. దానిని వల నుంచి తీయాలనుకున్న అన్నామలై ఆ చేపను నోటితో పట్టుకుని వల కొసను బలంగా లాగాడు. కానీ అనూహ్యంగా ఆ చేప అన్నామలై నోట్లోకి చేరి... గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో, ఊపిరాడక పోవడంతో అన్నామలై ఇబ్బంది పడ్డాడు.
 
మిగిలిన జాలర్లు అన్నామలైని ఆస్పత్రికి తరలించినా.. గొంతులో ఇరుక్కుపోయిన చేపను బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తుండగానే అన్నామలై మరణించాడు. ఈ ఘటన తిరుక్కోలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ నవలా రచయిత్రి, యద్దనపూడి సులోచనారాణి ఇక లేరు..