Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూ

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?
, గురువారం, 30 మార్చి 2017 (10:15 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పన్నీర్ మద్దతిచ్చే మధుసూదన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 
 
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎక్కువగా పన్నీర్‌ వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జయలలిత మరణం వెనుక రహస్యాలున్నాయి, శశికళ బండారం బయట పెడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన పన్నీర్‌ సెల్వం ఆ రహస్యాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ 90 శాతం నిజాలు ఏంటో బయట పెట్టిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాల్సిందిగా స్టాలిన్‌ సవాలు విసిరారు.
 
అయితే స్టాలిన్ వ్యాఖ్యల పట్ల పన్నీర్ సెల్వం ఘాటుగా స్పందించారు. డీఎంకే ఓటమి భయంతో ఇలా మాట్లాడుతుందన్నారు. 2006వ సంవత్సరంలో తనను అమ్మకు శశికళ దూరం చేయాలని చూసిందని.. అందుకు సంబంధించినవే ఆ 90 శాతం నిజాలంటూ సెల్వం వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోర్న్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి : సుప్రీం కోర్టు ఆదేశాలు