Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనియాకు ఏమైంది? ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆమె గత ఐదు రోజులుగా ఉంటున్నారు. ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో

సోనియాకు ఏమైంది? ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
, గురువారం, 11 మే 2017 (15:54 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి పాలయ్యారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆమె గత ఐదు రోజులుగా ఉంటున్నారు. ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
ఆమె ఆరోగ్య పరిస్థితిపై గురువారం గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్ డీఎస్ రానా మాట్లాడుతూ... "సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె చక్కగా కోలుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం..." అని పేర్కొన్నారు.
 
నిజానికి ఐదు రోజుల క్రితం కూడా డీఎస్ రానా ఇదే మాట చెప్పారు. పెద్ద సమస్య ఏం లేదనీ, ఫుడ్‌పాయిజనింగ్ అయిందని మరో 24 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కానీ, గురువారం కూడా ఇదే మాట మళ్ళీ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అసలు పార్టీ అధినేత్రికి ఏమైందంటూ ఆరా తీయసాగారు. 
 
కాగా, 69 ఏళ్ల సోనియా గత కొంతకాలంగా పలు మార్లు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గతేడాది ఆగస్టులో ఆమె అస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. వారణాసిలో రోడ్ షో సందర్భంగా ఆమె భుజానికి గాయమైంది. దీంతో ఆమె ఎడమచేతి భుజానికి సర్జరీ కూడా చేశారు. అనంతరం నవంబర్‌లో జ్వరం రావడంతో మళ్లీ రెండు రోజులు ఆస్పత్రిలో గడిపారు. ఆరోగ్య పరీక్షల కోసం ఇటీవల అమెరికా కూడా వెళ్లివచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాట రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తలైవా!