Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు

మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు
, గురువారం, 16 మే 2019 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు చేసిన వెధవపనికి అతని కుటుంబ సభ్యులందరినీ అనేక మంది కలిసి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గ్రామ శివార్లలో నివశిస్తున్నాడు. 
 
ఈ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమెను వదిలి ఉండలేని ఆ యువకుడు ఆమెను లేపుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ముఖేష్.. భార్యకు, ఆ యువకుడుతో ఫోనులో మాట్లాడి... సమస్యను చర్చించి పరిష్కరించుకుందామని చెప్పి గ్రామానికి రప్పించారు. 
 
ఆపై ఆ యువకుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను పట్టుకుని తన స్నేహితుల సాయంతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా న్యాయవాదులకు తప్పని లైంగిక వేధింపులు!