Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్తార్ పూర్ వెళ్లేందుకు సిద్ధూకు కేంద్రం అనుమతి

కర్తార్ పూర్ వెళ్లేందుకు సిద్ధూకు కేంద్రం అనుమతి
, శనివారం, 9 నవంబరు 2019 (07:12 IST)
కాంగ్రెస్‌ నేత, భారత మాజీ క్రికెటర్‌ సిద్ధూకు పాకిస్తాన్ కు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆయనకు భారత విదేశాంగశాఖ పర్మిషన్ జారీ చేసింది.

పాక్ వెళ్లేందుకు తనకు అనుమతులు మంజూరు చేయాలంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ కు గతంలో సిద్ధూ రెండు లేఖలు రాశారు. అయినా… కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన మూడో లేఖ రాశారు.

తన మూడో లేఖకు కూడా స్పందించకపోతే లక్షలాది మంది సిక్కు భక్తుల్లానే తాను పాక్ వెళ్తానని లెటర్ లో తెలిపారు. ఈ క్రమంలో సిద్ధూకు విదేశాంగశాఖ అనుమతులు మంజూరు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా శ్రీనాధ్ దేవిరెడ్డి