Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటి రూపాయల నల్లధనాన్ని పట్టిచ్చిన మహిళ.. పోలీసులు బెదిరింపులు..

నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసు

కోటి రూపాయల నల్లధనాన్ని పట్టిచ్చిన మహిళ.. పోలీసులు బెదిరింపులు..
, శనివారం, 19 నవంబరు 2016 (13:26 IST)
నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసులు వేధింపులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే ఓ మహిళ ఓ పాన్ షాపు నడుపుతోంది.
 
ఈ నెల 14 వతేదీన ఓ స్క్రాప్ డీలరు కోటిరూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టాడని అష్మినా పోలీసులకు సమాచారం అందించింది. అంతే జహంగీర్ పురి ప్రాంత బీట్ పోలీసులు వచ్చి స్క్రాప్ డీలరు ఇంటిపై దాడి చేసి అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. మరునాడు పోలీసులు లంచం తీసుకొని ఆ స్ర్కాప్ డీలరును వదిలిపెట్టారు. 
 
పోలీసులు తన వద్దకు వచ్చి స్క్రాప్ డీలర్‌పై పెట్టిన నల్లధనం కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారని మహిళ అష్మినా తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు రూ.2లక్షలు ఇస్తానని పోలీసులు ఆశ చూపించారని అష్మినా ఆరోపించారు. నల్లధనం వ్యవహారం, పోలీసుల తీరుపై అష్మినా డీసీపీ మిలంద్ దుంబ్రేను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌దిలిక‌ల్లో అనుమానాలు... 50 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా?