Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహితను.. ఇద్దరు పిల్లలున్నారు... సందీపే ఆదుకోవాలి : ఢిల్లీ మహిళ

తనకు తెలియకుండా తనను అనుభవించి, తన జీవితాన్ని నాశనం చేసిన ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమారే తనను ఆదుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తోంది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertiesment
Sex CD case
, ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (13:19 IST)
తనకు తెలియకుండా తనను అనుభవించి, తన జీవితాన్ని నాశనం చేసిన ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమారే తనను ఆదుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తోంది. 'నేను పేద మహిళను. వివాహితను. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి వ్యతిరేకంగా పోరాడే వనరులు నా వద్ద లేవు. బహిరంగంగా వీడియో లీక్‌ చేసి అతను నా పరువుకు భంగం కలిగించాడు. ఇందంతా తెలిశాక నన్ను సమాజం ఒప్పుకోద్దు. ఇందుకు బాధ్యుడైన అతన్ని కఠినంగా శిక్షించాలి' అని బాధితురాలు కోరింది 
 
'11 నెలల కిందట నేను సందీప్‌ కుమార్‌ను మార్కెట్‌లో కలిశాను. నాకు రేషన్‌ కార్డు ఇప్పించేందుకు సహాయం చేయమని కోరాను. నాకు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలు తీసుకొని ఒంటరిగా తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఆ తర్వాత నన్ను తన ఇంటికి పిలిచారు. ఇంటికి వెళ్వాక ఓ గదిలో వేచి ఉండమని చెప్పారు. ఆ తర్వాత నాకు మత్తుపదార్థాలు కలిపిని పానీయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం తనపై సందీప్‌కుమార్‌ అత్యాచారం జరిపారని, మర్నాడు ఉదయం తనను ఇంటినుంచి పంపించాడని ఆమె పోలీసులకు చెప్పింది.
 
'తనను సందీప్‌ వీడియో తీస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆమెను ట్రాప్‌ చేసి అతను వాడుకున్నాడు' అని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా ఎందుకు చేశావని ఆమె మర్నాడు ఉదయం సందీప్‌ను నిలదీసిందని, ఇలా చేయడం వల్ల తన పెళ్లిపై ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెప్పారు. 'రేషన్‌ కార్డు కావాలంటే నువ్వు లొంగిపోక తప్పదు అని సందీప్‌ చెప్పాడు. నీ పెళ్లి జీవితం రోడ్డున పడకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు' అని పోలీసులు వివరించారు. తనను మోసం చేసిన సందీప్‌ చివరకు రేషన్‌ కార్డు కూడా ఇప్పించలేదని, అవమానభారంతో తాము మరో ఇంటికి మారామని బాధితురాలు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో దారుణం : 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు అత్యాచారం