Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ .150 స్కానింగ్, రూ. 50కే ఎంఆర్ఐ ...ఎక్కడో తెలుసా?

Advertiesment
రూ .150  స్కానింగ్, రూ. 50కే ఎంఆర్ఐ ...ఎక్కడో తెలుసా?
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:39 IST)
ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్  పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే  అతి చౌక డయాగ్నొస్టిక్  సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 

తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను  కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్  కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ఏడాది  డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు.

అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్‌ఐ  కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔరంగజేబు పన్నులు, తుగ్లక్ నిర్ణయాలు రద్దు చేస్తాం: భట్టి విక్రమార్క