Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముస్లిం బాలికల జననాంగ ఛేదనపై పిల్..

ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో

ముస్లిం బాలికల జననాంగ ఛేదనపై పిల్..
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:53 IST)
ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు గట్టెక్కకపోవడంతో.. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడటం కోసం ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. 
 
ఈ నేపథ్యంలో ముస్లింలలోని కొన్ని వర్గాల్లో బాలికల జననాంగ ఛేదనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఈ ఛేదన చర్య బాల హక్కులను హరించడమేనని ఓ న్యాయవాది పిల్ వేశారు. 
 
ఈ వాదనతో గతంలో కోర్టూ ఏకీభవించగా దీని చెల్లుబాటుపై లోతైన అధ్యయనం చేయాలని దావూదీ బోహ్ర వర్గ ముస్లింలు తెలిపారు. దీంతో  పరిశీలించాలని రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమృత్ పథకం నిర్వహణలో ఏపీ ఫస్ట్... ఇదిగోండి సర్టిఫికేట్: తెలంగాణ వెనుకబడిపోయిందే?