Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు సీరియస్: రిజర్వ్‌లో తీర్పు

విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు సీరియస్: రిజర్వ్‌లో తీర్పు
, గురువారం, 10 మార్చి 2022 (23:26 IST)
vijay mallya
వ్యక్తిగతంగా హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా రెండు వారాల్లో హాజరు కావాలని విజయ్ మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. 
 
వ్యక్తిగతంగా, లేకపోతే న్యాయవాది అయినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్టు పేర్కొంది.
 
కాగా.. బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోవడం తెలిసిందే. అయితే, రుణ ఎగవేతలపై న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంతో మాల్యాపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదయ్యాయి. 
 
బుధవారం అమికస్ క్యూరీ పనుల ఒత్తిడిలో ఉండడంతో, ఈ కేసు నేటికి వాయిదా పడింది. నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సినిమా రిలీజా? అయితే, వంద టిక్కెట్లు ఇవ్వండి.. మేయర్ లేఖ