Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ చనిపోయాక ప్రమాణం చేశాను.. పన్నీరు పార్టీని నాశనం చేయాలని?: శశికళ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆరోపించారు. తాను జయలలిత చనిపోయిన తర్వాత ప్రమాణం చేశానని.. ఆమె మాట ప్రకారం

Advertiesment
Sasikala
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (11:57 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఆరోపించారు. తాను జయలలిత చనిపోయిన తర్వాత ప్రమాణం చేశానని.. ఆమె మాట ప్రకారం పార్టీని నాశనం చేయకుండా చూడటం తన బాధ్యతని శశికళ చెప్పుకొచ్చారు.

అమ్మ చనిపోయే చివరి క్షణాల్లో తనతో చెప్పిన మాటలను శశికళ ఎమ్మెల్యేలతో చెప్పారు. మన పార్టీని ఎవరూ నాశనం చేయలేరని.. జయలలిత చెప్పినట్లు చిన్నమ్మ చెప్పారు. ఆమె చెప్పిన మాట కోసమే కొందరు నమ్మకద్రోహుల నుంచి పార్టీని కాపాడేందుకు తాను ముందుకొచ్చానని శశికళ చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందంటూ అన్నాడీఎంకేలో సంక్షోభానికి పన్నీర్ సెల్వం తెరలేపిన సంగతి తెలిసిందే. జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని, ఆ తర్వాత మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడారు. పార్టీని కాపాడాలంటూ అమ్మ తనతో చెప్పిందని పన్నీరు చెప్పారు.

ఇప్పుడు శశికళ కూడా పన్నీరు బాటలోనే పయనిస్తున్నారు. జయలలిత చనిపోయే చివరి క్షణాల్లో తనతో మన పార్టీని ఎవ్వరూ నాశనం చేయలేరని చెప్పినట్లు శశికళ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త తిరుగుళ్లు-భార్య ఫోన్‌‌కు నోటిఫికేషన్లు: విడాకులు ఇచ్చేసింది.. ఉబెర్‌‌పై కేసు..?