Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా?

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళలు పట్టుబట్టారు. ఈ రాజకీయం ఇపుడు రాజ్‌భవన్‌కు చేరింది.

శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. రాజ్‌భవన్ వర్గాల ఆరా?
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:10 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళలు పట్టుబట్టారు. ఈ రాజకీయం ఇపుడు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని పన్నీర్‌ సెల్వం, ఆ స్థానాన్ని ఆశిస్తున్న శశికళలు గురువారం వేర్వేరుగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలిసిన విషయం తెలిసిందే. వారు పేర్కొన్న అంశాలను రాజ్‌భవన్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 
 
ముఖ్యంగా గవర్నర్‌ సీహెచ్.విద్యాసాగర్ రావుకు శశికళ సమర్పించిన లేఖలో 131 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. ఆ లేఖలో ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని అందించారు. శుక్రవారం రాజ్‌భవన్‌ వర్గాలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. శశికళ ఆదివారం పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైనప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మారిన పరిణామాల దృష్ట్యా పన్నీర్‌ సెల్వానికి మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితుల్లో శశికళకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య తగ్గాల్సి ఉంది. 
 
కానీ గురువారం రాత్రి ఆమె గవర్నర్‌కు సమర్పించిన లేఖలోనూ 131 మంది పేర్లను ప్రస్తావించారని సమాచారం. దీంతో ఈ సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమె వెంట 90 మంది మాత్రమే ఉన్నారని పన్నీరుసెల్వం వర్గం చెపుతోంది. శశికళకు మద్దతుగా సంతకాలు చేసిన శాసనసభ్యులు సైతం ఇష్టపూర్వకంగా చేయలేదని, బెదిరింపులకు తలొగ్గాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఈ దిశగా కూడా రాజ్‌భవన్‌ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంజీఆర్ తలపిస్తున్న పన్నీర్... తరలివస్తున్న కార్యకర్తలకు కడుపునిండా భోజనం...