Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారు.. సారీ చెప్పే ప్రసక్తే లేదు : సాధ్వి ప్రాచీ

పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారు.. సారీ చెప్పే ప్రసక్తే లేదు : సాధ్వి ప్రాచీ
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:16 IST)
దేశ పార్లమెంట్‌లో ఉగ్రవాదులున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్వ హిందూ పరిషత్ మహిళా నేత సాధ్వి ప్రాచీ మరోమారు అదే మాటలను ప్రస్తావించారు. పార్లమెంట్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గత ఆగస్టు నెలలో రూర్కీలో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రాచీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఇదే అంశంపై రాజ్యసభ హక్కుల సంఘం (పార్లమెంటరీ ప్యానెల్) చేపట్టిన విచారణకు ఆమె హాజరై.. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. 'నేను ఈ దేశ పుత్రికను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. క్షమాపణ చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అరుపులతో నా నోరు మూయించాలని చూశారు. నాకూ మాట్లాడే హక్కుందన్నాను' అని తేల్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్