Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (09:56 IST)
వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన కర్నూలు జిల్లా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
గురువారం మంచిరోజు కావడంతో పాటు.. మంచి ముహుర్తం ఉందని పేర్కొంటూ కొద్ది సేప‌టి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప‌సుపు కండువా క‌ప్పించుకున్నారు. ఇపుడు చంద్రబాబు నివాసంలో పచ్చ కండువా కప్పించుకున్నప్పటికీ... తాడేప‌ల్లిలో నిర్వ‌హించే కార్యక్రమంలో బుడ్డాను అధికారికంగా టీడీపీలో చేర్చుకోనున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మద్దతుదారులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మ‌రోవైపు అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి కూడా టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకుడుగుంతలు ఉంటేనే కొత్త గృహాలకు ప్లాన్ ఇవ్వండి : హైకోర్టు