తమిళనాడు అసెంబ్లీలో సంచలనం : 89 మంది డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్
తమిళనాడు రాష్ట్ర శాసనసభలో సంచలనం చోటుచేసుకుంది. అసెంబ్లీలో ఉన్న డీఎంకేకు చెందిన 89 మంది విపక్ష సభ్యులను అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను ప్రతి రోజూ అడ్డుకుంటున్నందుకుగాను
తమిళనాడు రాష్ట్ర శాసనసభలో సంచలనం చోటుచేసుకుంది. అసెంబ్లీలో ఉన్న డీఎంకేకు చెందిన 89 మంది విపక్ష సభ్యులను అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను ప్రతి రోజూ అడ్డుకుంటున్నందుకుగాను వారం రోజుల పాటు డీఎంకే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
సభలో స్పీకర్ చర్యకు నిరసనగా డీఎంకే సభ్యులు సభలోనే కూర్చొన్నారు. దీంతో అసెంబ్లీ విపక్ష నేత ఎంకే స్టాలిన్తో పాటు పలువురు ముఖ్య నేతలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ప్రభుత్వం తనను అవమానించిందని, ఏ మాత్రం మర్యాదలేకుండా ప్రవర్తించిందని స్టాలిన్ ఆరోపించారు.
కాగా, ప్రతినిత్యం సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నందుకుగాను డీఎంకే సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని శాసనసభా నేత, ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు.