Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ ప్రత్యేక హోదా... నిలదీసిన రేణుకా చౌదరి... చూస్తున్న తెదేపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేం

ఏపీ ప్రత్యేక హోదా... నిలదీసిన రేణుకా చౌదరి... చూస్తున్న తెదేపా ఎంపీలు
, సోమవారం, 25 జులై 2016 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేందుకు సిద్ధమని చెప్పారు. డిప్యూటి స్పీకర్ నిర్ణయం పైన కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరితో సహా పలువురు ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు.
 
ఈ దశలో తెలుగుదేశం ఎంపీలు అలా చూస్తూ ఉన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ... మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆ సంతాపాన్ని తెలియజేయడాన్ని చూస్తూనే ఉన్నామని చెపుతూ, ప్రత్యేక హోదా కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా బిల్లు చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సభ గందరగోళంగా మారింది. దీనితో డిప్యూటీ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీ తిరుగుబాటుదారులపై లింగభేదం లేకుండా లైంగిక దాడులు... ఆమ్నెస్టీ సంస్థ వెల్లడి