Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలు జీవితం గడపలేను... జీవసమాధి అవుతా : రాజీవ్ హంతకుడు మురుగన్

‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు.

జైలు జీవితం గడపలేను... జీవసమాధి అవుతా : రాజీవ్ హంతకుడు మురుగన్
, ఆదివారం, 23 జులై 2017 (12:14 IST)
‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు. వచ్చే నెల 18 నుంచి తాను ఆహారం తీసుకోనంటూ వేలూరు జైలు సూపరింటెండెంట్‌ ద్వారా చెన్నై జైళ్ల శాఖ కార్యాలయానికి ఒక వినతిపత్రం పంపాడు. తాను జీవసమాధి కావడానికి అనుమతి ఇవ్వాలని అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. 
 
రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదీలుగా మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో, ఇదే కేసులో మురుగన్‌ భార్య నళిని వేలూరు మహిళా ప్రత్యేక జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. వీరికి విధించిన జీవితశిక్షాకాలం పూర్తయింది. అయినప్పటికీ.. వీరు నలుగురు 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వీరిలో నళిని, మురుగన్‌ దంపతులైనందున రెండు వారాలకు ఒకసారి ఇద్దరు పోలీసు భద్రతతో కలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే పడకసుఖం కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే