Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచార కేసు పెట్టిందనే కోపంతో.. చీరకట్టుకెళ్లి చంపేశాడు.. ఎక్కడ..?

అత్యాచార కేసు పెట్టిందనే కోపంతో.. చీరకట్టుకెళ్లి చంపేశాడు.. ఎక్కడ..?
, మంగళవారం, 15 జూన్ 2021 (16:11 IST)
అత్యాచార బాధితురాలు తనపై కేసు పెట్టిందనే కోపంతో బాధితురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 2020లో అత్యాచారం చేశాడని తనపై కేసు పెట్టిందని కక్షతో ఆడవేషంలో వచ్చి మరీ ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలో సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్ అనే వ్యక్తి ఇంటి పొరుగునే ఓ వింతువు తన ఇద్దరు పిల్లలు, చెల్లెలితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో పొరుగునే ఉంటున్న ఆమెపై కన్నేసిన నేత్రమ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2020లో జరిగింది.
 
తనపై జరిగిన దారుణానికి కుమిలిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నేత్రమ్‌ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ మీద బయటకొచ్చాడు నేత్రమ్. అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు. కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరిస్తున్నాడు. పదే పదే బెదిరిస్తు కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. కానీ ఆమె కేసు వెనక్కి తీసుకోను..నీకు శిక్ష పడేదాకా ఊరుకోనంటూ తెగేసి చెప్పింది.
 
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేత్రమ్.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో గత అర్థరాత్రి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ఆడవేషం వేసుకున్నాడు. ముసుగు వేసుకుని బాధితురాలి ఇంటికి వెళ్లి..నిద్రపోతున్న ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆమె పెద్దగా కేకలు పెట్టటంతో మెలకువ వచ్చిన ఆమె చెల్లెలికి ఇంట్లో ఎవరో అక్కమీద దాడి చేస్తున్నట్లుగా తెలుసుకుంది. అంతే ఒక్కసారిగా లేచి సదరు వ్యక్తిని అడ్డుకోబోయింది. దీంతో ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు.
 
ఆ దాడిలో కట్టుకుని చీర ఊడిపోగా..అతడిని నేత్రమ్ గా గుర్తుపట్టింది బాధితురాలి చెల్లెలు. కానీ అతను కత్తిపోట్లకు బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్‌లోనే కాదు.. చైనా కూడా డెల్టా వేరియంట్ అలజడి