Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం
, సోమవారం, 13 నవంబరు 2017 (06:58 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అల్వార్‌ జిల్లా ఫహారీ గ్రామానికి చెందిన ఉమర్‌ ఖాన్‌, తహీర్‌ ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆవులను తరలిస్తుండగా గోసంరక్షణ కార్యకర్తలు గుర్తించి, వారిపై దాడికి దిగారు. వారిని చితకబాదడమే కాకుండా, తమ వద్ద ఉన్న నాటు తుపాకీలతో వారిపై కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో ఉమర్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తహీర్‌ గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈఘటనపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రణాళిక ప్రకారమే ఉమర్‌ను హత్య చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌