Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖాకీల కళ్లలో కారం కొట్టి.. నిందితుడిని కాల్చి చంపిన దుండగులు

gunshot
, గురువారం, 13 జులై 2023 (13:55 IST)
ఓ హత్య కేసులోని నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసుల వాహనంపై ఓ ముఠా దాడి చేసింది. పోలీసుల కళ్లలో కారం కొట్టి ఆ నిందితులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 2022లో జరిగిన స్థానిక భాజపా నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా, విజయ్ పాల్ అనే వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వీరిని కోర్టులో కోర్టులో హాజరుపరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణాసంస్థకు చెందిన బస్సులో బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దండగులు హలేనా పోలీస్ స్టేషను పరిధిలో ఉన్న అమోలీ టోల్లాజా వద్దకు ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12 మందికి పైగా సాయుధులైన దుండగలు వచ్చి, బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు. 
 
వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా కుల్దీప్ జఫీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు... ఎక్కడ?