Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పు చెల్లించలేక పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికిచ్చారు

రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు త

Advertiesment
Rajasthan
, సోమవారం, 29 ఆగస్టు 2016 (10:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక అప్పుడే పుట్టిన పసికందును వడ్డీ వ్యాపారికి ఇచ్చిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. అప్పుతో పాటు.. వడ్డీ చెల్లించలేక పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఇచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో కలురాం అనే వ్యక్తి బాలురాం అనే వ్యాపారి వద్ద రూ.20 వేల నగదు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించలేనని ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన తన భార్యతో కలిసి వెళ్లి వ్యాపారి బాలురాంకు కొడుకును ఇచ్చాడు. 
 
ఆ పసికందును ఏం చేయాలో తెలియని వడ్డీవ్యాపారి శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగించి జరిగిన ఉదంతాన్ని వారికి వివరించారు. ఆ చిన్నారికి సంరక్షణ కేంద్రం సిబ్బంది బర్ధన్ అనే పేరు పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని శిశుసంరక్షణ అధ్యక్షురాలు మాయ సుబల్కా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను క్రిమినల్ కావొచ్చు.. టీవీల్లో అందంగా ఉండే ఫోటోలు చూపించాలి