పన్నెండో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆపై కళ్లలో పొడిచారు.. వెన్నెముకను విరిచేశారు..
దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో ఓ బాలికపై దారుణం చోటుచేసుకుంది. 15 బాలి
దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో ఓ బాలికపై దారుణం చోటుచేసుకుంది. 15 బాలికపై కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ బాలికను చంపేందుకు దాడి చేశారు. ఈ క్రమంలో కళ్లలో పొడిచి.. బాలిక వెన్నెముకను విరిచేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే రాజస్థాన్థాన్ చురు జిల్లాకు చెందిన 15ఏళ్ల విద్యార్థిని ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆ పాఠశాలకు చెందిన ఓనర్ తన బంధువులతో కలిసి బాలికను కిడ్నాప్ చేశాడు. ఆపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని కిరాతకులు.. బాలికను చంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాలిక కళ్లకు తీవ్రంగా గాయపరిచి.. వెన్నెముకను విరిచేశారు.
ప్రస్తుతం బాధిత బాలిక జైపూర్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు నిందితులను ఇంకా పట్టుకోలేదు. కానీ ప్రజలు ఈ దుర్ఘటనపై మండిపడుతున్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.