Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఠాణాలో ఫాస్టర్‌ను చితకబాదిన స్థానికులు...

ఠాణాలో ఫాస్టర్‌ను చితకబాదిన స్థానికులు...
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫాస్టర్‌ను కొంతమంది స్థానికులు చితకబాదారు. బలవంతపు మతమార్పిడులు చేయిస్తున్న కారణంతో ఆ ఫాస్టర్‌పై పోలీస్ స్టేషన్‌లోనే తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
 
రాయపూర్‌లోని పురానీ బస్తీ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, భాటాగావ్ ప్రాంతంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో క్రైస్తవ సమాజానికి చెందిన మరికొందరితో కలిసి సదరు పాస్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడకు పెద్ద ఎత్తున హిందూ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల ముందే పాస్టర్‌ను హిందూ సంఘాల నేతలు చితకబాదారు. 
 
ఇది జరిగిన వెంటనే పాస్టర్‌ను స్టేషన్ ఇన్ఛార్జి గదిలోకి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈనాడు విలేఖరిపై విచారణ జరిపించాలని క‌డియం గ్రామ‌స్తుల‌ ధర్నా