Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు.. స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

సెల్వి

, శనివారం, 21 సెప్టెంబరు 2024 (18:46 IST)
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించడంతో ఇప్పుడు యావత్ భారతదేశం తిరుమల లడ్డూ అంశంపై చర్చనీయాంశమైంది. కేంద్ర పెద్దలు కూడా దీనిపైనే స్పందిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంపై ఎవరినీ నిందించలేమనీ, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
''తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులున్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి." అని రాహుల్ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడ్డూపై ఉత్కంఠ.. తిరుమలలో మహాశాంతి యాగం - టీటీడీ కీలక నిర్ణయం