Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ సాధారణ ప్రయాణికుడు.. వైరల్ అవుతున్న చిత్రమిది!

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టనున్న రాహుల్ గాంధీ సాధారణ ప్రయాణికుడిలా మారిపోయారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు తన వీఐపీ హోదాను పక్కనబెట్టి సాదాసీదాగా నడుచుకున్

Advertiesment
Rahul Gandhi
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (14:41 IST)
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టనున్న రాహుల్ గాంధీ సాధారణ ప్రయాణికుడిలా మారిపోయారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు తన వీఐపీ హోదాను పక్కనబెట్టి సాదాసీదాగా నడుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన రాహుల్.. ప్రచారానికి కాసింత విరామమిచ్చి.. తన తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనే నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత తిరిగి అహ్మదాబాద్‌కు బయలుదేరగా, ఆయన టిక్కెట్ ఇండిగో విమానంలో బుక్ అయింది. 
 
బోర్డింగ్ పాస్ తీసుకుని, రన్ వేపై ఉన్న విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ ఏమాత్రం ఏమాతభేషజాలకు పోకుండా, వీఐపీనన్న హోదాను పక్కనబెట్టి, విమానం ఎక్కేందుకు తన వంతు కోసం వేచి చూస్తూ, క్యూలైన్‌లో రాహుల్ గాంధీ నిలుచున్నారు. ఈ దృశ్యాన్ని ఫోటో తీసిన ఇండిగో, "వెల్ కమ్ ఆన్ బోర్డ్ మిస్టర్ రాహుల్ గాంధీ. హ్యావ్ ఏ గుడ్ ఫ్లయిట్" అంటూ ఓ ట్వీట్‌ను ఉంచింది. 
 
ఈ ట్వీట్‌‍ను చూసిన వారిలో పలువురు రాహుల్‌ను మెచ్చుకుంటూ అభినందనలు కురిపించారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఇటీవల ఇండిగో విమానాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని నీచుడు అనడం తప్పే.. : ములాయం సింగ్