Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ రైలు ప్రయాణం... సమస్యలు చెప్పుకున్న ప్రయాణికులు

Advertiesment
rahul train journey
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:29 IST)
కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ రైలులో ప్రయాణించారు. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే క్రమంలో ఆయన రైలులో ప్రయాణం చేసారు. ఈ సందర్బంగా ఓ హాకీ క్రీడాకారిణి.. రాహుల్‌తో తన సమస్యలను వివరించింది. అలాగే, పలువురు ప్రయాణికులు కూడా తమ కష్టాలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అందుతున్న శిక్షణ, వసతులు, 'ఖేలో ఇండియా' పథంకంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో మాత్రం రైలులో ప్రయాణించారు. రాయ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో ఆయన బిలాస్‌పూర్ - ఇత్వారీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రె్ స్లీపర్ క్లాస్ తరగతిలో ప్రయాణించారు. రాహుల్ వెంట ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేస్ బఘేల్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్‌లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తాము గతంలోనే ఫిర్యాదు చేశామని కూడా చెప్పారు. అలాగే, ఖేలో ఇండియా ద్వారా మె అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. శిక్షణ తరగతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. 
 
రాహుల్ ట్రైన్ జర్నీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ స్పందించింది. వాళ్ల ముఖాల్లో ఆనందం చూడండి. రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు)కు ఉన్న తేడా ఇదే అంటూ అధికారపక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిపూర్‌‌లో కిడ్నాప్‌కు గురైన విద్యార్థుల హత్య... ఫోటోలు వైరల్...