Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలిసి మద్యం సేవించి.. భర్తపై సలసలకాగే వేడి నూనె పోసిన భార్య...

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. భర్తతో కలిసి మద్యం సేవించిన భార్య.. చివరకు భర్తపై సలసలకాగుతున్న వేడినూనెను పోసింది. దీంతో భర్త ముఖం 10 శాతం మేరకు కాలిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన

కలిసి మద్యం సేవించి.. భర్తపై సలసలకాగే వేడి నూనె పోసిన భార్య...
, మంగళవారం, 18 జులై 2017 (10:29 IST)
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. భర్తతో కలిసి మద్యం సేవించిన భార్య.. చివరకు భర్తపై సలసలకాగుతున్న వేడినూనెను పోసింది. దీంతో భర్త ముఖం 10 శాతం మేరకు కాలిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైకు చెందిన భరత్ అర్జున్‌రామ్ (26), పూణేకు చెందిన జయా అర్జున్ (38) అనే దంపతులు ఉన్నారు. అయితే, అర్జున్ రామ్ మాత్రం ముంబై నగరంలోని చెంబూర్‌లోని ఓ మొబైల్ దుకాణంలో పనిచేస్తూ వారాంతంలో ఇంటికి వచ్చి వెళ్లేవారు. అలాగే, భార్య జయ పూణే నగరంలో ఓ సేల్స్ విభాగంలో పనిచేస్తోంది. 
 
ఈ క్రమంలో ముంబై నుంచి భరత్ శనివారం పూణేలోని భార్య వద్దకు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పీకలదాకా మద్యం తాగారు. మద్యం తాగుతూనే భర్త భరత్ నిద్రలోకి జారుకున్నాడు. మద్యం తాగిన భార్య జయ మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై వేడి చేసిన ఆయిల్‌ను పోసింది. 
 
దీంతో తీవ్ర గాయాల పాలైన భరత్‌ను పోలీసులు శాసూన్ ఆసుపత్రికి తరలించారు. భార్య వేడి నూనె పోయడం వల్ల 10 శాతం ముఖం కాలిపోయిందని చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారు. భర్తపై వేడి నూనె పోసిన భార్య జయపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కబడ్డీ ఆడేందుకు వస్తే.. ఆ కామాంధుడు ఏం చేశాడంటే...