మొత్తం ఆస్తిని సైనికులకు రాసిచ్చిన పూణె వాసి .. భార్య, కుమార్తె మద్దతు
పూణెకు చెందిన ఓ వ్యాపారవేత్త తన మొత్తం ఆస్తిని సైనికులతో పాటు రైతులకు చెందేలా ఓ వీలునామా రాసిపెట్టారు. దీనికి ఆయన భార్య, కుమార్తెలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
పూణెకు చెందిన ఓ వ్యాపారవేత్త తన మొత్తం ఆస్తిని సైనికులతో పాటు రైతులకు చెందేలా ఓ వీలునామా రాసిపెట్టారు. దీనికి ఆయన భార్య, కుమార్తెలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అతని పేరు ప్రకాశ్ కేల్కర్. వయసు 73 యేళ్లు. మొత్తం ఆస్తిని రైతులు, సైనికుల సంక్షేమానికి ధారాదత్తం చేశారు. తన సంపదలో 30 శాతం చొప్పున సైన్యానికి, ప్రధాని, ముఖ్యమంత్రి సహాయ నిధులకు, మిగిలిన పదిశాతం సమాజసేవకు పరితపిస్తున్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు దక్కేలా వీలునామా రాశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటించారు.
జౌళి రంగ నిపుణుడిగా బహుళజాతి సంస్థల్లో పనిచేసి రిటైరైన ఆయన తన యావత్ సంపదను పేదలు, సైనికుల సంక్షేమానికి ఇస్తున్నట్టు ప్రకటించిన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 2013లో తనకీ ఆలోచన వచ్చిందని, తన భార్య, తాను కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న కేల్కర్ ఈ విషయమై ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వశాఖలను సంప్రదించినట్టు తెలిపారు.