రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీస్ (NIEPVD) విద్యార్థులు ప్రత్యేక పాట పాడగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో మూడు రోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము సంస్థను సందర్శించారు. అక్కడ వికలాంగ విద్యార్థులు ఆమెకు (శుక్రవారం) పుట్టినరోజు నివాళి అర్పించారు.
విద్యార్థులు చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రపతి ముర్మును ఎంతగానో కదిలించాయి. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె దానిని ఆపుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఆమెకు ఆమె భద్రతా సిబ్బంది టిష్యూ పేపర్ అందించారు. కన్నీళ్లు పెట్టుకున్న ముర్ము చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనితో చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"నేను నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. వారు తమ హృదయం నుండి పాడారు. చాలా అందంగా శుభాకాంక్షలు తెలియజేశారు" అని రాష్ట్రపతి తరువాత సభలో మాట్లాడుతూ అన్నారు.