Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ

రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ
, శుక్రవారం, 19 నవంబరు 2021 (09:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గత యేడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు విజయం సాధించారు. 

 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. సాగు చట్టాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ వ్యాప్తంగా కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగాసాగింది.

 
రైతులు ఢిల్లీ ఎర్రకోట వేదికగా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. పైగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకు రూ.50 వేలు చెల్లించాల్సిందే.. జగన్ తరపు న్యాయవాదులకు కోర్టు హెచ్చరిక