Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో వాద్ నగర్

vadh nagar
, బుధవారం, 21 డిశెంబరు 2022 (12:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మించిన స్థలం వాద్ నగర్. గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇపుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఈ ప్రాంతానికి చోటుదక్కింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ప్రదేశం చేరిపోయినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.ఐ) వెల్లడించింది. తాజాగా ఎంపిక చేసిన ప్రపంచ వారసత్వ ప్రాంతాల్లో వాద్ నగర్‌తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటి (రాతి శిల్పాలు) సైతం ప్రత్యేక గుర్తింపు పొందాయి. 
 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన యునెస్కో... అన్ని రకాలుగా పరిశీలించిన మీదట తగిన అర్హతలున్న వాటికి ఈ జాబితాలో చోటుకల్పించింది. సాంస్కృతిక, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్‌లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితా కోసం గుర్తించడంతో ఎన్.ఎస్.ఐ కృషి చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూనివర్శిటీ విద్యకు తాలిబన్ మహిళలు దూరం