Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

Advertiesment
Gandhi

సెల్వి

, గురువారం, 2 అక్టోబరు 2025 (09:47 IST)
Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. వీరి అడుగుజాడల్లో భారతదేశం నడుస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి మోదీ నివాళులు అర్పించారు. 
 
గాంధీ జయంతి అహింసకు సంకేతమని పునరుద్ఘాటించారు. ఇది గాంధీజీ శాంతి, నైతిక జీవన తత్వాన్ని గౌరవించడమే కాక, అంతర్జాతీయ అహింస దినంగా కూడా పనిచేస్తుంది. అతని సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎక్స్ ద్వారా ప్రధాని పేర్కొన్నారు.  
 
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి ఆయనను అసాధారణమైన రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించారు.
 
అక్టోబర్ 2, 1904న, జన్మించిన శాస్త్రి జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత 1964లో శాస్త్రి భారత రెండవ ప్రధానమంత్రిగా ఎదిగారు. తన చారిత్రాత్మక నినాదం 'జై జవన్, జై కిసాన్' కోసం అతను అమరత్వం పొందారు. తరతరాలుగా కొనసాగుతున్న సైనికులు, రైతులకు అండగా నిలిచారు. 
 
సాధారణ పౌరులతో వినయం, నిజాయితీ, లోతైన బంధానికి పేరుగాంచిన శాస్త్రి నాయకత్వం భారతదేశం రాజకీయ, సామాజికతపై శాశ్వత ప్రభావాన్ని చూపిందని ప్రధాని కొనియాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?