Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నాం.. మాటిచ్చా... నిలబెట్టుకున్నా: మోడీ

సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున

Advertiesment
Diwali
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:54 IST)
సరిహద్దుల్లో రేయింబవుళ్లు కాపలా కాస్తున్న సైన్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. మీ వల్లే మేం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు చెప్పారు. దీపావళి సంబరాలను ఆయన సైనికులతో కలిసి జరుపుకున్నారు. 
 
ఇందులోభాగంగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లా సుమ్‌డౌలో ఐటీబీపీ, భారత ఆర్మీ జవాన్లను, డోగ్రా స్కౌట్స్‌ను కలుసుకున్నారు. సైనికులకు స్వీట్లు తినిపించారు. జవాన్లు కూడా ప్రధానికి స్వీట్లు తినిపించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైన్యం వల్లనే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. దేశం అంతా సైన్యం వెంటే ఉందని, దీపావళి సందర్భంగా దేశ ప్రజలంతా సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగిస్తున్నారని మోడీ చెప్పారు.
 
ఇకపోతే.. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై సైనికులకు మాటిచ్చి నిలబెట్టుకున్నానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు 500 కోట్ల రూపాయలుగా అంచనా వేశాయని, తాను రంగంలోకి దిగాక 10 వేల కోట్ల రూపాయలని తేలినా వెనుకంజ వేయలేదని చెప్పారు. సైనికుల కోసం ఏమైనా చేయాలనుకున్న తన ఆకాంక్ష నెరవేర్చానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాఫీ పీనా హై ఆజ్' ఇదీ భారత్‌లో పాక్ గూఢచారుల కోడ్ లాంగ్వేజ్