Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీని పూర్తి చేయాల్సిందే...

Farmers
, సోమవారం, 16 మే 2022 (18:54 IST)
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 
 
దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్‌లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది.
 
కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. 
 
ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్‌ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ తండ్రి ఓ పాస్‌పోర్టు బ్రోక‌ర్ అనే సంగ‌తి మ‌రిచారా? నోరు అదుపులో..?