Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండుగ సీజన్ లో పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

పండుగ సీజన్ లో పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు
, గురువారం, 9 జనవరి 2020 (17:42 IST)
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా రూ.20 కు పెంచేసారు.

ఈ ధరలు  జనవరి 9(గురువారం) నుంచి జనవరి 20 వరకు అమలు కానున్నాయి. సంక్రాంతి సెలవుల రద్దీ కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం ఖాయమని ప్లాట్ ఫాంపై రద్దీని కొంతవరకూ నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో Realme5i లాంచ్... ఫీచర్లేంటో తెలుసా?