Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిక్కర్ సీసాలపైనా అలా ముద్రించాలి... హైకోర్టులో పిల్

Advertiesment
PIL
, శనివారం, 5 మార్చి 2022 (16:28 IST)
మద్యం సీసాలు ప్యాకేజీలపై ఆరోగ్య హెచ్చరికను ప్రచురించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు పిల్ దాఖలైంది. కానీ దీనిపై నోటీసు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.

ఢిల్లీలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు (డ్రగ్స్) నిషేధించాలని లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోర్టును కోరారు.
 
ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించడం సాధ్యపడదని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటానికి ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం జూలై 4కు వాయిదా వేసింది.
 
ధూమపానం కంటే మద్యపానం పది రెట్లు ప్రమాదకరమని, అయితే మద్యం బాటిళ్లపై ఆరోగ్య హెచ్చరికను ఉపయోగించలేదని, సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా అన్ని ఆల్కహాల్ బాటిళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉండాలని కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదు నగరంలో ఐపీఎస్‌లకు పోస్టింగులు